Header Top logo

విప్ ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి వర్షం లో ఆగని ప్రచారం

AP 39TV 19ఫిబ్రవరి 2021:

రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలో వర్షం లో కూడా సాధారణ వ్యక్తిలా గొడుగు పట్టుకుని ప్రచారం చేస్తున్న కాపు.ప్రజలకు అండగా ఉండే ఏకైక పార్టీ వైఎస్ఆర్ సీపీ  ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.వర్షంలోనూ ఆగని ప్రచార హోరు 6వ వార్డు లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తట్టె మంజునాథ తరపున శుక్రవారం ఉదయం వర్షంలోనూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటా పర్యటించిన కాపు రామచంద్రారెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి కుటుంబం మేలు కోరుతూ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ట్లు చెప్పారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సేవకులుగా మున్సిపల్ ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సి పి కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం జగనన్నకు కృతజ్ఞత చాటుకోవాలని పిలుపునిచ్చారు.

 

 

 

 

 

 

 

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking