Header Top logo

సంగమేశ్వర సర్కిల్ నందు జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన – భారతీయ జనతా పార్టీ

AP 39TV 11ఏప్రిల్ 2021:

మహాత్మ జ్యోతిరావు పూలే  జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు సంది రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని సంగమేశ్వర సర్కిల్ నందు జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పాలేగార్ మంజునాథ్ నాయుడు పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ మహనీయుడు ఆదర్శప్రాయుడు బీసీల కోసం పాటు పడ్డ త్యాగమూర్తి త్యాగాలు మర్చిపోలేనివని భారతీయ జనతా పార్టీ ఆయన అడుగుజాడల్లో నడుస్తుందని కొనియాడారు.బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ నాయుడు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో త్యాగాలు చేశారని, భారతదేశంలో ఓబీసీలు అభివృద్ధి చెందాలంటే ఆయన మార్గదర్శకాల తోనే సాధ్యమయ్యాయి అని, మహనీయుని త్యాగాలు ఈ భూ ప్రపంచం ఇంతవరకు గుర్తుండిపోతాయి అని భారతీయ జనతా పార్టీ ఓ బి సి ల ను గుర్తిస్తుందని బీసీలు ఎదగాలంటే ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని అందుకు నిదర్శనం ఒక బీసీ ప్రధానమంత్రి అవ్వడమే అని నరేంద్ర మోడీ  అడుగుజాడల్లో మా జిల్లా అధ్యక్షుడు సంది రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన బీసీ లందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే 2024 ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అధికార ధ్యేయంగా పనిచేస్తుందని మంజునాథ్ నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి ఎం ఎస్ లలిత్ కుమార్ ,రాష్ట్ర నాయకులు పొట్లూరి హరికృష్ణ ,రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యులు అశోక్ నగర్ అశోక్ ,అనంతపురం బిజెపి కన్వీనర్ గొంది అశోక్ ,జిల్లా ఓబిసి నాయకులు కాటమయ్య, బిజెపి జిల్లా నాయకులు రామకృష్ణారెడ్డి.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking