Header Top logo

మూడో రోజు తో ముగిసిన స్థానిక ఎన్నికల నామినేషన్ లు,

ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:

రాయదుర్గం తాలూకా, కనేకల్ మండలం, స్థానిక ఎలక్షన్ లలో భాగంగా మూడవరోజు నామినేషన్ల దాఖలు ముగిసాయి. అభ్యర్థిగా పోటీ చేయు వారు కనేకల్ మండల పరిధిలోని ఎంపీడీవో ఆఫీస్, ఐకెపి వెలుగు ఆఫీస్, MRC ఆఫీస్, మీటింగ్ హాల్ తహసిల్దార్ కార్యాలయం, ఈ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు అధికారులకు అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీడీవో విజయ్ భాస్కర్ మాట్లాడుతూ కనేకల్ మండలం లోని 18 పంచాయతీలు, 196 వార్డులు, 214 పోలింగ్ స్టేషన్స్ తెలియజేశారు. 18 పంచాయతీలకు 141 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారని, 196 వార్డు మెంబర్లకు గాను 447 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపిడివో తెలియజేశారు. నామినేషన్ ముగిసినందున జరగబోవు ఫిబ్రవరి 13వ తేదీ న ఎలక్షన్ కు పోలీస్ సిబ్బంది, ఎలక్షన్ ఆఫీసర్, బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ కు సరిప డు అన్ని విధాల మేము రెడీగా ఉన్నాం అంటూ విలేకర్ల సమావేశంలో కనేకల్ ఎంపీడీవో విజయ భాస్కర్ తెలియజేశారు. ఇప్పటివరకు జరిగిన నామినేషన్ల లో ఏ రోజు ఎటువంటి గొడవలు జరగలేదని సజావుగా జరిగాయని విలేకర్ల సమావేశంలో ఎంపిడిఓ విజయభాస్కర్ తెలియజేశారు.

R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.

Breaking