Header Top logo

టిడిపి వారికి ఓట్లు అడిగే హక్కు లేదు-ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

AP 39TV 24 ఫిబ్రవరి 2021:

ప్రశాంతతకు నిలయంగా ఉన్న అనంతపురంను టిడిపి నాయకులు వారి ఆధిపత్యం కోసం కలహాల కుంపటిగా మార్చేశారని,అలాంటి వారికి ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  విమర్శించారు.నగరంలోని 35వ డివిజన్ కు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అబిలిగొండ కృష్ణ,చెరుకూరి వెంకటేష్ వారి అనుచరులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే అనంత సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారన్నారు. వైసీపీ మద్దతుదారులకు అనూహ్య విజయాన్ని కట్టబెట్టారన్నారు. అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనకు మెచ్చి ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరికలు జరుగుతున్నట్లు చెప్పారు. తప్పకుండా నగర పాలక సంస్థతో పాటు అన్ని మునిసిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. పార్టీలో చేరిన వారంతా వైసీపీ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి, 35వ డివిజన్‌ కన్వీనర్‌ కొండ్రెడ్డి ప్రకాశ్‌రెడ్డి,రుద్రంపేట ఉప సర్పంచ్ నరేంద్రరెడ్డి,నాయీ బ్రాహ్మణ సంఘం రాయలసీమ అధ్యక్షుడు నరసింహులు, కోశాధికారి విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking