Header Top logo

పరిటాలకు షాక్‌ : వైఎస్సార్‌సీపీలోకి జెడ్పీటీసీ అభ్యర్థి దివిటి రామలింగయ్య

AP 39TV 08మార్చ్ 2021:

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి మరో షాక్‌ తగిలింది. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో నిలిచిన దివిటి రామలింగయ్య ఆ పార్టీ కి గుడ్‌బై చెప్పారు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నివాసంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking