Header Top logo

ఫుట్ పాత్ ల విస్తరణపై మంత్రి కేటీఆర్..

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, నూతన మౌలిక వసతుల కల్పన, ఫుట్ పాత్ ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత – కేటీఆర్

పాదచారులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రజారవాణా బలోపేతంతోనే నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణ జరుగలన్నారు.

హైదరాబాద్ నగరంలో ఫుట్ పాత్ ల నిర్మాణం, విస్తరణ, ప్రణాళికల రూపకల్పన కు సంబంధించి నగర పోలీస్ అధికారులతో పాటు జిహెచ్ఎంసి,సంబంధిత ఇతర శాఖల అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.

రోజురోజుకు అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో పాదాచారులకు రక్షణ కల్పించడం, పుట్ పాత్ ల నిర్మాణం, రోడ్ల విస్తరణ లాంటి సవాళ్లు నిత్యం ఎదురవుతూనే ఉన్నాయన్న కేటీఆర్, ఎప్పటికప్పుడు నూతన ప్రణాళికలను అమలుచేయడంతోనే ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

పాదచారుల రక్షణ కోసం పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అందించాల్సిన సహకారంతో పాటు నగరంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్ లు, నూతన ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

నగరంలో ఇప్పటికే 60 జంక్షన్ లను జిహెచ్ఎంసి అభివృద్ధి చేస్తోందని, పాదాచారులే ప్రధాన కేంద్రంగా దాదాపు 12 జంక్షన్లలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ కు జిహెచ్ఎంసి అధికారులు ఈ సమావేశంలో వివరించారు. కూకట్ పల్లి, సోమాజిగూడ, పంజాగుట్ట,కొత్తపేట, హబ్సిగూడ, ఖైరతాబాద్ వంటి అనేక ప్రాంతాల్లో నూతనంగా జంక్షన్ లను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking