Header Top logo

ఎమ్మార్వో ఆఫీస్ ముందు శవంతో..

ఎమ్మార్వో ఆఫీస్ ముందు శవంతో..
నిర్దేశం, జనగామ :
రెవెన్యూ అధికారుల వేధింపులకు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామంలో జరిగింది. ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని రైతు రఘుపతి నుంచి సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ 4 లక్షలు వసూలు చేసారు. డబ్బులు తీసుకొని రెండేళ్లుగా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో రఘుపతి మనస్థాపం చెందాడు. అప్పుగా తెచ్చిన డబ్బులు తిరిగిఇవ్వాలని పలుమార్లు వేడుకున్నా, డబ్బులు ఇవ్వకుండా వేదించడంతో వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బచ్చన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు డెడ్ బాడీతో బందువులు ధర్నాకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking