Header Top logo

వడ్డెరలను పూర్తిగా విస్మరించిన వైసీపీ ప్రభుత్వం – టిడిపి రాష్ట్ర కార్యదర్శి దేవళ్ళ మురళి

AP 39TV 23 ఏప్రిల్ 2021:

ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని అదేవిధంగా వడ్డెర కులానికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి హామీలను పూర్తిగా రూపు మార్చి వడ్డెర కులాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు వడ్డెర కులస్తులు ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై శుక్రవారం ఆయన నగరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారుఈ సందర్బంగా మురళి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే వడ్డెర లను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో వడ్డెర ఫెడరేషన్ ను కార్పొరేషన్ కార్పొరేషన్ చేసి 132 కోట్లు నిధులు కేటాయించి ఆర్థికంగా వెనుకబడిన వడ్డెర కులాన్ని ఎంత గానో ఆడుకున్నారనీ గుర్తు చేశారు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక 2019-20 2020-2021 బడ్జెట్లలో వడ్డెర కార్పొరేషన్ కు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో వడ్డెర కులస్తులు ఎస్టిలుగా ఉన్నారు కాబట్టి అక్కడ మాకు రాజకీయ ప్రాధాన్యత ఉద్యోగ తదితర వాటిలో మేము అభివృద్ధి చెందాము ఆంధ్ర ప్రదేశ్ లో బీసీ లుగా ఉండడం వల్ల అభివృద్ధిలో వడ్డెర కులం చాలా వెనుక బడి ఉందని వీటిని గుర్తించి వెంటనే వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనీ కోరారు
ఈ కార్యక్రమంలో కుంచపు వెంకటేష్, నాగరాజు, ప్రసాద్, సత్యమయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking