Header Top logo

తాగోచ్చి హింసించే భర్తను ఏమి చేసిందంటే..?

తాగోచ్చి హింసించే భర్తను భార్య ఏమి చేసిందంటే..?

  • ప్రమాదవశాత్తు మరణించాడని పోలీసులకు సమాచారం  
  • పోలీసుల విచారణలో విస్తు గొలిపే నిజాలు..  
  • భర్త సర్కార్ జాబ్ కోసమే హత్య చేసిన భార్య..

ఔను.. అతను కష్టాలలో సుఖాలలో కలిసి ఉంటానని పెళ్లి మండపంలో తాళి కట్టాడు.. కొంత కాలం బాగానే ఉన్నారు. వాళ్లిద్దరి మధ్య మధ్యం భూతం గొడవలకు కారణమైంది. ఓపికతో భర్త వేధింపులను భరించిన భార్య చివరకు భర్తను హంతం చేయాలని ప్లాన్ వేసింది. తాగి వచ్చిన భర్త తలపై కొట్టి హత్య చేసిన భార్య ప్రమాదవ శాత్తు మరణించాడని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె మాటలలో నిజం లేదని  నమ్మిన పోలీసులు విచారణ జరిపారు.

అంతే..  పోలీసులు తమ స్టైల్ లో విచారణ చేయడంతో నిజాాలు వెెలుగులోకి వచ్చాయి.

వేధింపులు తప్పడంతో పాటు, కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం తనకు దక్కుతుందన్న ఆలోచనతో హత్య చేసినట్లు అంగీకరించింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలను చుంచుపల్లి ఎస్సై కె.సుమన్‌ బుధవారం వెల్లడించారు.

ఇక్కడి గాంధీకాలనీకి చెందిన కొమ్మరబోయిన శ్రీనివాస్‌(50) కొత్తగూడెం కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నారు.

గత నెల 29న అర్ధరాత్రి ఆయన వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయమైందని భార్య సీతామహాలక్ష్మి (43) మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది.

కొద్దిగంటల చికిత్స అనంతరం ఆయన మృతి చెందాడు. తండ్రి మృతిపై అనుమానం ఉన్నట్లు కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కనిపించకుండా పోయిన సీతామహాలక్ష్మిపై నిఘా పెట్టారు.

మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు.

”ఆ రోజు నా భర్త తాగిన మైకంలో ఇంటికొచ్చాడు. నిద్రలోకి జారుకున్నాక కర్రతో తలపై కొట్టా. వంటగదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టా.” అని నిందితురాలు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking