Header Top logo

నేడు భార‌త్ బంద్‌

కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల వ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వస్తున్నాయి . ఈ నేప‌థ్యంలో ఈ-వే బిల్లుతో పాటు చ‌మురు ధరల పెరుగుద‌ల‌కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్ నిర్వ‌హిస్తున్నారు.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.93గా ఉండ‌గా, డీజిల్ రూ.81.32కు చేరింది. హైద‌రాబాద్‌లో పెట్రోలు లీట‌రుకు రూ.94.54, డీజిల్ ధ‌ర రూ.88.69గా ఉంది. ముంబైలో లీట‌రు పెట్రోలు ధ‌ర 97.34, డీజిల్ ధ‌ర రూ.88.44గా ఉంది.

అంతర్జాతీయంగా ఆయిల్ ఉత్పతులు తగ్గడంతో పాటు క‌రోనా ప్రభావం ఉత్పత్తిపై పడటం వల్ల ధరల పెరుగుదలకు కారణమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెపింది . చ‌మురు ధ‌ర‌లపై ఒపెక్ ప్లస్ దేశాలు త్వ‌ర‌లో సమావేశమై, చమురు ఉత్పత్తిని పెంచే అవకాశాలపై చర్చించనున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Breaking