Header Top logo

రాజ‌కీయ పార్టీల నేత‌లతో స‌మావేశం కానున్న ఏపీ ఎస్ఈసీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పుర‌పాలిక ఎన్నిక‌లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. ఇందులో భాగంగా రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో స‌మావేశం కానుంది. పుర‌పాలిక ఎన్నిక‌లపై ప్రాంతాల వారీ స‌మావేశాల‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది

ఈ స‌మావేశాల్లో భాగంగా క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో ఎస్ఈసీ ఈ నెల 27, 28 మార్చి 1న స‌మావేశం కానున్నారు . ఈ నెల 27న ఐదు జిల్లాల్లో రాజ‌కీయ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం ఉంటుంది. అనంత‌రం, విజ‌య‌వాడ‌లోని కార్యాల‌యంలో ఎస్ఈసీ స‌మావేశం నిర్వ‌హిస్తుంది. ఇందులో మిగిలిన జిల్లాల అధికారులు పాల్గొంటారు

ఈ నెల 27, 28 మార్చి 1న ప్రాంతీయ స‌మావేశాలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ సెనేట్ హాల్‌లో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని వివ‌రించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking