Header Top logo

తెలంగాణ SI కానిస్టేబుల్ అభ్యర్థులకు షాక్‌

పోలీసు.. ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా..? అయితే.. ఈ వార్త మీకోసమే.. ప్రైమరీ రాత పరీక్షలో అర్హత మార్కులు తగ్గిస్తారని ఆశలు పెట్టుకుంటే మీరు వదులు కోవాల్సిందే..

తెలంగాణ SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు షాక్‌ ఇచ్చింది నియామక మండలి.

ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో ఈవెంట్స్ మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి.

దీంతో తుది రాత పరీక్ష నిర్వహణపై టిఎస్ఎల్పిఆర్బి దృష్టి పెట్టింది.

ఈ నేపథ్యంలో ప్రైమరీ రాత పరీక్షలో వలె అర్హత మార్కులు తగ్గించే అవకాశాలు ఉన్నాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి.

అయితే అలాంటిదేం లేదని పోలీసు నియామక మండలి స్పష్టం చేసింది.

జనరల్ అభ్యర్థులు-80, బీసీ-70, ఎస్సీ, ఎస్టీ-60 మార్కులు సాధిస్తేనే ఎంపిక అవుతారు.

కాగా, డిసెంబర్‌ 16వ తేదీన పోలీస్‌ ఈవెంట్స్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే

Leave A Reply

Your email address will not be published.

Breaking