Header Top logo

పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కు ప్రాధాన్యత ఇస్తాం – మేయర్ మహమ్మద్ వసీం.

AP 39TV 24ఏప్రిల్ 2021:

పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కు ప్రాధాన్యత ఇస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని రెండవ డివిజన్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులకు బూట్లు,గ్లౌజ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ విపత్తులో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరువలేనిది అన్నారు. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల రక్షణ కోసం బూట్లు,గ్లౌజ్ లను అందించడం జరిగిందన్నారు.కార్మికులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రమోహన్ రెడ్డి, ఎం హెచ్ ఓ రాజేష్, ఎన్విరాల్మెంట్డి డిఈ రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking