Header Top logo

ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో ఇవాళ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు

ఏపీ 39 టీవీ,
ఏప్రిల్ -03,హైదరాబాద్

కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో ఇవాళ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం పౌర విమానయాన కార్యదర్శిని ఈ భేటీ సందర్భంగా కోరారు. కాగా రాష్ట్రంలో ఎయిర్ స్ట్రిప్ ల మంజూరీ కోసం తాను కృషి చేస్తానని ప్రదీప్ సింగ్ ఖరోలా సీఎంకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఈఎన్సీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.


ఎం.శ్రీధర్,
ఏపీ39 టీవీ,రిపోర్టర్,

Leave A Reply

Your email address will not be published.

Breaking