Header Top logo

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు

అనంతపురం జిల్లా: తేది: 29-01-21

అనంతపురం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కదిరి డివిజన్ పరిధిలోని ఆమడగూరు, బుక్కపట్నం, తలుపుల, గాండ్లపెంట, ఓ.డి.చెర్వు, నల్లచెర్వు, కదిరి, పుట్టపర్తి, ఎన్పీకుంట, కొత్తచెర్వు, నల్లమడ, తనకల్లు మండలాల్లోని గ్రామ పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీలకు అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాల మేరకు నామినేషన్ల కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. నామినేషన్ వేసేందుకు ముగ్గురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. నామినేషన్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking