Header Top logo

విద్యాసంస్థల బంద్ విజయవంతం – ఐక్య విద్యార్థి సంఘాలు

AP 39 TV 26 మార్చ్ 2021:

జిల్లా వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ కు మద్దతుగా విద్యాసంస్థలు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బిసి సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే బిల్లు చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు అధికమయ్యాయని నిత్యావసరాలు పెరిగాయని దేశంలో నిరుద్యోగులకు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ఎఫ్ అధ్యక్షులు అబ్దుల్ ఆలం, ఏ ఎస్ ఓ ఓబులేసు, బిసి ఎస్సి ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి ప్రవీణ్, లక్ష్మీపతి నాయక్, సందీప్, హరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking