Header Top logo

Mahaprasthana of Bapu dolls-2 బాపు బొమ్మల మహాప్రస్థానం-2

Mahaprasthana of Bapu dolls-2

బాపు బొమ్మల మహాప్రస్థానం-2

కవితా ! .ఓ కవితా…!

మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి మకుటాయమైన గీతం. “కవితా ! ఓ కవితా !..కవిత్వం స్పాంటేనియస్ అనడానికి ఈ గీతమే ఓ ఉదాహరణ. “రావద్దు రావద్దు లోనికి   రాస్తున్నానొక గీతం  రావద్దు రావద్దు లోనికి  నను చూడ కాదిది వేళ నా మనః కార్మిక శాల  క్రక్కేది చండాగ్ని సెగలు క్రమ్మేది….”!! కవిత్వారంభం పెద్ద అవస్థ.అది నా లాంటి పిల్లకవికైనా, శ్రీశ్రీ లాంటి మహాకవికైనా, శ్రీశ్రీ గారు ఆరంభించి, పూర్తిచేయకుండా,  మధ్యలో వదిలిన గీతాలు ఎన్నో వున్నాయి. (అనంతం122).మహాప్రస్థానం లోని “మరో ప్రపంచం..

మరో ప్రపంచం  మరో ప్రపంచం పిలిచింది”..అనే గేయం.రాయడానికి శ్రీశ్రీ గారికి అయిదు నిమిషాలకు మించి పట్టలేదంటే ఆశ్చర్యంగా వుంటుంది.మరో ప్రపంచం అని ప్రారంభించి భుగభుగలు అని ముగించే దాకా పెన్సిల్ ఆపలేదు. మర్నాడు ఈ గీతాన్ని  ఫెయిర్ చేసి పత్రికకు పంపితే.” రిటర్న్డ్ విత్ థ్యాంక్స్ “అని తిరుగు టపాలో వచ్చింది. అది వేరే సంగతి.ఇప్పుడు చెప్పొచ్చేదేమంటే..? ఏ కవితైనా ఆరంభం పెద్ద అవస్థని..! కవితా ! ఓ కవితా! గీతం కూడా ఆరంభించాకు శ్రీశ్రీ ఎక్కడా ఆపలేదు. ఇంత పెద్ద గీతం కూడా ఏకబిగిన రాసేశాడు.శ్రీశ్రీ ఫ్లో కు ఈ గీతం ఓ ఉదాహరణ. అంతే కాదు మహాప్రస్థానం లోని చాలా రచనలు ఒక్క మాటు ఒక్క చోటు రాసినవే.అయితే నాలుగైదు గీతాలు మాత్రం మొదలు ప్రారంభించి తర్వాత కొన్నాళ్ళకు పూర్తి చేశారు.ఇలాంటి వాటిలో ‘ జగన్నాథ రధ’ చక్రాలు పోయెమ్ ఒకటి. బుర్రబద్దలు కొట్టొకొని ఆలోచిస్తే వచ్చేది కవిత్వం కాదు. నిజమైన కవిత్వం హృదయ తంత్రుల నుంచి తన్నుకురావాలి. అలా వచ్చిందే.. కవితా ! ఓ కవితా ! గీతం.

శ్రీశ్రీ గారికి కవిత్వం అమ్మ లాంటిది..

శ్రీశ్రీ గారికి కవిత్వం అమ్మ లాంటిది.’ భార్యకన్నా కవిత్వాన్ని ఎక్కువగా ప్రేమించాడు.బాల్యంలో అమ్మను కోల్పోయిన శ్రీశ్రీ కి ఆ వెలితి ఆయన మనో ప్రపంచంలో అలాగే వుండి పోయింది.అందుకేనేమో ? కవిత్వంలో అమ్మను చూసుకున్నాడు. కవిత్వాన్ని ప్రేమించాడు. లాలించాడు. కవిత్వంలోనే ఓదార్పు పొందాడు‌. “నా బహరంతరింద్రియాల్లో ప్రాణం ప్రసరించగ నేనీ భూలోకంలో పడి సుఖదుఃఖాలేవేవో వస్తూంటే తలదాలిచి ప్రపంచం పరిణాహంలో ప్రయాణికుడనై పరివ్రాజకుడనై విహ్వలంగా వర్తించే వేళ అభయ హస్త ముద్రతో నను దరిసిన ,నన్ను పునీతుని కావించిన కవితా! ఓ కవితా! అని ఆక్రందించాడు. ఆ పొయిటిక్ ఫ్లోను అక్షరబద్ధం చేశాడు.అది కవితైంది. నవ కవితై.. కవిత్వానికే భాష్యంగా నిలిచింది. కవిత్వాన్ని సుందరమైన దేవిగా ఆరాధించి, అందని అందంగా భావించి తపించిన రోజుల్లో శ్రీశ్రీ కి  కవిత్వ నిజదర్శనం కాలేదు.’చటులాలంకారపు కుటిల వర్తనాలలో కవితా దేవి మాటు మాయమై సాక్షాత్కారం జరుగలేదు. ఆ దేవి దర్శనం కోసం తాను  ఏకాంతంలో చీకటి కోణాల్లో చూపించాడు. ‘ చిదీక్షా తపస్సమీక్షణలో ఓ రాత్రి తను మస్తిష్కంలో ప్రాణం స్పందన పొందిందీ … గీతం.!

కవితా! ఓ కవితా!  కవితా!

కవితా! ఓ కవితా!  కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిను నే నొక సుముహూర్తంలో, అతి సుందర సుస్యందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో, నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున, ఎటు నే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున, నా గుహలో, కుటిలో, చీకటిలోఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో, చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో, నిశ్చల సమాధిలో, స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిక్షంలో ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో ? నే నేయే చిత్ర విచిత్ర శ్యమంతరోచిర్ని వహం చూశానో! నా గీతం ఏయే శక్తులలో ప్రాణస్పందన పొందిందో ? నీకై నే నేరిన వేయే ధ్వనులలో, ఏయే మూలల వెదికిన ప్రోవుల ప్రోవుల రణన్ని నాదాలో! నడిరే యాకస మావర్తించిన, మేఘా లావర్షించిన, ప్రచండ ఝుంఝూ ప్రభంజనం గజగజ లాడించిన నడి సంద్రపు కెరటాల్లో, మ్రోగిన శంఖారావం, ఢంకాధ్వానం; ఆ రాత్రే, కారడవులలో లయాతీతమై విరుతించిన నానాజంతుధ్వనులలో? నక్షత్రాంతర్నిబడ నిఖలగానం, భూకంపాలు, ప్రభుత్వ పతనాలు, విప్లవం, యుధ్ద్ధం, అన్నీ, నీ చైతన్యం! నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే నా కగుపించే ద్రుశ్యాలా? వినిపించే భాష్యాలా ? అగ్ని సరస్సున వికసించిన వజ్రం!

అపుడే ప్రసవించిన శిశువు

ఎగిరే లోహశ్యేనం! ఫిరంగిలో జ్వరం ద్వనించే మ్రుదంగ నాదం. ఇంకా నే నేం విన్నానా? నడిరే నిద్దురలో అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొనిరుచిర స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు!  శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మ్రుతు లూచే చప్పుడు! వైద్యశాలలో, శస్త్రకారుని మహేంద్రజాలంలో, చావు బ్రదుకుల సంధ్యాకాలంలో కన్నులుమూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన! కాలువ నీళులలో జారిపడి కదలగ నైనా చాలని త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన! ప్రేలాపన! కడుపు దహించుకు పోయే పడుపుకత్తె రాక్షసరతిలో అర్ధ నిమీలత నేత్రాల భయంకర భాధల పాటల పల్లవి! ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం! ఉన్మాది మనస్సి నీవాలిలో ఝాకంకేకా, భేకంబాకా! సమ్మెకట్టిన కూలీల, సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం! ఆర్తారావం!

ఒక లక్ష నక్షత్రాల మాటలు

ఒక లక్ష నక్షత్రాల మాటలు, ఒక కోటి జలపాతాల పాటలు, శతకోటి సముద్రతరంగాల మ్రోతలు! విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను. నా విన్నని కన్నని విన్నవించగా మాటలకై వెదుకాడగ పోతే అవి, పుంఖానుపుంఖంగా శ్మశానాలవంటి నిఘంటువుల దాటి, వ్యాకరణాల సంకెళ్ళు విడిచి, చంధస్సుల సర్వపరిష్వంగం వదలి- వడిగా, వడివడిగా వెలువడినై, పరుగుడినై, నా యెదనడుగిడినై! ఆ చెలరేగిన కలగాపులగపు విలయావర్తపు బలవత్ ఝరవత్ పరివర్తనలో, నే నేయే వీధులలో చంక్రమణం చేశానో, నా సృష్టించిన గానంలో ప్రక్షుళిత మామక పాపపరంపర లానంద వశంవద హృదయుని జేస్తే. నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో, ఊపిరి తీస్తున్నానోనిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో, అటు నను మంత్రించిన, సమ్ముగ్ధంగావించిన ఆ గాంధర్వానికి, తారానివహపు ప్రేమసమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మ్మపు పరిచుంబనలో, ప్రాణావసానవేళాజనితం, నానాగాననూనస్వానావళితం, బ్రతుకును ప్రచండభేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం, సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం. అమోఘ, మఘాధ, మచింత్య, మమేయం, ఏకాంతం, ఏకైకం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం కలిగించిన, నను కరిగించిన కవనఘ్రుణీ!

రమణీ! కవితా! ఓ కవితా!

రమణీ! కవితా! ఓ కవితా! నా జనని గర్భంలో, ఆకారం లేకుండా నిద్రిస్తూన్న, నా అహంకారానికి ఆకలి గొల్పించిన నాడో! నా బహిరంత రింద్రియాలలో ప్రాణం ప్రసరించగ, నే నీ భూలోకంలో పడి సుఖదుఃఖా లేవేవో వస్తూంటే తలదాలిచి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనై, పరివ్రాజకుడినై, విహ్వలంగా వర్తించేవేళ అభయహస్త ముద్రతో ననుదరిసిన నన్ను పునీతుని కావించిన కవితా! లలిత లలిత కరుణామహితా అనుపమితా! అపరిమితా! కవితా! ఓ కవితా నేడో నా ఊహంచలసాహసికాంసం కప్పిన నానిట్టూర్పులు వినిపిస్తాయా? నే నేదో విరచిస్తానని, నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో ఘార్ణిల్లగ నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా, అందీ అందకపోయే నీ చేలాంచముల విసరులకొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా, నా గీతం నైవేద్యంగా, హృద్యంగా, అర్పిస్తానో నా విసరిన రస విసృమం.

ఓహో! ఓ రసధుని మణిఖని! జననీ! ఓ కవితా! కవితా! ఓ కవితా! ఓ కవితా!”!! (సంక్షిప్తం)

 *బాపు బొమ్మలతీరు …!!

కవితా ! ఓ కవితా! గీతానికి బాపు రెండు బొమ్మలు వేశారు. ఈ రెండు బొమ్మలు కూడా ఎంతోఅర్థవంతంగా, భావస్ఫోరకంగా వున్నాయి. మొదటి బొమ్మ శ్రీశ్రీ కవితా లతాంగి. రెండో బొమ్మ వ్యాకరణాల సర్ప పరిష్వంగనం నుంచి బయటపడే ప్రయత్నం.

ఇప్పుడు…ఈ రెండు బొమ్మలకు ‘బ్నిం’ వివరణను చూద్దాం.!

శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో మకుటాయమైన ఈ గీతాన్ని చదివి బాపుగారు ముచ్చటైన రెండు  బొమ్మలు వేశారు.

ఒకటి.. భూగోళమే వీణ బుర్రగా సరస్వతిని ఊహిం చారు. రెండోది.. శ్రీశ్రీ గారి కవిత స్మశానాల నిఘంటువులు దాటి వ్యాకరణాల సంకెళ్ళు తెంచి ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి వచ్చిన దృశ్యాన్ని బాపు చిత్రంగా వేశారు.ఇందులో సర్పంతో పోరాడుతున్నట్లు,లేదా చిక్కుల్లోంచి బయట పడుతున్న కవిని చూపారు.అలు అనే అక్షరాన్ని సర్పంగాచూపడం చక్కటి వాక్చిత్రం’ అంటారు.. ‘బ్నిం’…!!

Happiness in contentment "తృప్తిలోనే ఆనందం…!!

ఎ.రజాహుస్సేన్,  హైదరాబాద్…!!

Leave A Reply

Your email address will not be published.

Breaking