Header Top logo

మహబూబాబాద్ లో మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్య

  • 8వ వార్డు కౌన్సిలర్ రవిపై గొడ్డలితో దాడి చేసిన దుండగులు
  • రోడ్డు పక్కన నిలబడి ఉండగా దాడి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి
తెలంగాణలోని మహబూబాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పత్తిపాకలో 8వ వార్డు కౌన్సిలర్ బానోతు రవిపై ఆగంతుకులు గొడ్డలితో దాడి చేశారు. రోడ్డు పక్కన రవి నిలబడి ఉండగా దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
తీవ్ర గాలయాలతో రక్తపు మడుగులో ఉన్న రవిని అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking