Header Top logo

ప్రభుత్వ కొలువు వదిలి…..? ప్రజా సేవలో తరలించాలని

ఏపీ 39టీవీ 12 ఫిబ్రవరి 2021:

గుడిబండ: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో వ్యయ ప్రయసాలకోర్చి ఉద్యోగం సంపాదించి ఎంతోమంది ఉద్యోగులు తమ కుటుంబంతో హాయిగా ఉండే ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రభుత్వ కొలువును వదిలి ప్రజాసేవలో తరిoచాలన్న సంకల్పంతో గుడిబండ పంచాయతీ వైఎస్సార్సీపీ మద్దతుతో సర్పంచ్ గా నామినేషన్ వేసిన జిబి కర్ణాకర్ గౌడ్ ను పలువురు అభినందిస్తున్నారు. మండల కేంద్రమైన గుడిబండ గ్రామ పంచాయతీ ప్రస్తుతం ఎన్నికల్లో బి సి జనరల్ కేటాయించడంతో జి బి కర్ణాకర్ గౌడ్ తనకు ప్రస్తుతం ఉన్న వీఆర్వో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తన కుటుంబానికి ఉన్న రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని గుడిబండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా శుక్రవారం నామినేషన్ వేశారు తన కుటుంబం యావత్ ప్రజా సేవకే అంకితం కావడం తన పెద్ద అన్న జి బి సుధాకర్ ఉప సర్పంచ్ గా, తన చిన్న అన్న జి బి శివకుమార్ గుడిబండ మండల జడ్పిటిసి గా మరియు తన మాతృమూర్తి సుశీలమ్మ సర్పంచ్ గా ఎన్నికై ప్రజాసేవ చేయడంతో తాను కూడా అదే బాట లో పయనించాలని ఉన్న వీఆర్వో ఉద్యోగాన్ని వదలి సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగిందని తన జీవితం కూడా ప్రజాసేవ లో తరలించాలన్న దృడ సంకల్పంతో గుడిబండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అని ఆయన ఏపీ 39 టీవీ ప్రతినిధికి తెలిపారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ 39 టీవీ న్యూస్ గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking