Header Top logo

Johar Khudiram Bose జోహార్ ఖుదీరామ్ బోస్

Johar Khudiram Bose

జోహార్ ఖుదీరామ్ బోస్

చేతికి సంకెళ్ళతో అమాయకంగా కనిపిస్తున్న ఈ బాలుడు ఎవరో తెలుసా ?

అతను ఒక విప్లవం, చైతన్యం. పేరు ఖుదీ రామ్ బోస్ 18 ఏళ్ళు 8 నెలల 8 రోజుల వయసులో బ్రిటీష్ వారు ఉరితీసిన అతి చిన్న స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. అతను మరియు అతని మిత్రుడు ప్రఫుల్ల సర్కార్ సాయంతో బాంబులతో గుర్రపు బండిపై వెళుతున్న బ్రిటీష్ అధికారి Dutch magistrate Kingsfordని చంపారు. తరువాత అతను బ్రిటీష్ పోలీసులకు పట్టుబడ్డాడు.

ప్రతీకారం తీర్చుకున్న ఖుదీరామ్ బోస్

బీహార్లోని ముజఫర్ లో అనేక మంది భారతీయులను హతమార్చిన క్రూర అధికారి Kingsfordపై ప్రతీకారం తీర్చుకున్నారు. అతన్ని చంపిన తరువాత బోస్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి రోజూ రాత్రి సమయంలో 25 మైళ్లు నడిచేవాడు. కొన్ని రోజులకు ఇప్పుడు VAINI సమీపంలో దొరికాడు. ప్రస్తుతం దీనిని ఖుదీరామ్ బోస్ స్టేషన్ గా పిలుస్తారు.

బ్రిటీష్ వారిని బాంబులతో చంపాడు

1889లో డిసెంబర్3న జన్మించిన ఖుదీరామ్ బోస్ మిడ్నాపూర్ బెంగాల్ నుండి వచ్చారు. 15 ఏళ్ళ వయసులో అతను బ్రిటిష్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి అరబిందో ఘోష్ మరియు సోదరి నిమితీటాల నుంచి ప్రేరణ పొందాడు. అతను విప్లవకారులతో చేరాడు. మరియు 3 సంవత్సరాలలో చాలామంది బ్రిటీష్ వారిని బాంబులతో చంపడానికి లక్ష్యంగా చేసుకుని చంపాడు.

సంతోషంగా ఉన్నాడు

చివరికి ఏప్రిల్ 30,1908 న పట్టుబడ్డాడు. అతను పట్టుకున్నప్పుడు అతను ముజఫర్పూర్ లో వీధులన్నీ తిప్పారు. అలా తిప్పినపుడు అసలు విచారంగా లేకుండా పైగా సంతోషంగా ఉన్నాడు. అతను వందేమాతరం అంటూ నినాదాలను చేస్తూ అరవటం మొదలు పెట్టాడు. అతని స్నేహితుడు ప్రఫుల్లా కూడా పట్టుబడ్డాడు. విప్లవ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరులుగా మారారు. Johar Khudiram Bose

చిరునవ్వుతో స్వయంగా మెడకు..

బోస్ జైలులో ఉన్నపుడు ఎవరి పేరును బ్రిటీష్ అధికారులకు ఎంత వేధించినా చెప్పలేదు. పైగా ఇతర విప్లవకారులను రక్షించడానికి వారు చేసిన పనులను తనపై వేసుకుని అందరికీ పడే శిక్షను తను సంతోషంగా స్వీకరించాడు. అతనికి మరణశిక్ష విధించినపుడు సానుభూతి పరులను స్నేహితులను ఉత్సాహపరిచాడు. ఉరివేసే రోజున తన తాడును తానే చిరునవ్వుతో స్వయంగా మెడకు తగిలించుకున్నాడు.

జీవితాలను బలి చేశారు

ఈ మరణం భారతదేశంలో చాలా మంది యువతను ప్రేరేపించాయి మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అగ్ని యుగం అని పిలవబడే ఆ రోజులలో చాలామంది యువకులు వీరి త్యాగాలను చూసి ఈ ఉద్యమంలో చేరారు మరియు తమ జీవితాలను బలి చేశారు.

ఆగష్టు 11, 1908 ఖుదిరామ్ బోస్ ను ఉరితీశారు.

సేకరణ: కటారి రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking