Header Top logo

టిడిపి నుండి వైసీపీ లోకి చేరిక

రాప్తాడు నియోజకవర్గం రూరల్ మండలం కక్కలపల్లి మరియు కొడిమి పంచాయితీ చెందిన టిడిపి నాయకులు సుంకన్న, మస్తాన్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 80 కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తోనే రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు బండి పవన్ , గోవింద్ రెడ్డి , రూరల్ జెడ్పిటిసి అభ్యర్థి చంద్ర , మండల యూత్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాసులు మండల గ్రీవెన్స్ సెల్ ఇంచార్జ్ రాజ, మండల నాయకులు తిరుపాల్, మనోజ్ కుమార్,మండల నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు. ,

Leave A Reply

Your email address will not be published.

Breaking