Header Top logo

హిందూపురం పట్టణంలోని MGM హైస్కూలులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూం మరియు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన – సత్య ఏసుబాబు

AP 39TV 13 మార్చ్ 2021:

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని MGM హైస్కూలులో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూం మరియు కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  పరిశీలించారు. అక్కడ చేపట్టిన కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. కట్టుదిట్టమైన భద్రతతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. పెనుకొండ డిఎస్పి ఎస్ మహబూబ్ బాషా, ఇన్స్పెక్టర్లు బాలమద్దిలేటి, మన్సూరుద్ధీన్ , అస్రార్ బాషా, తదితరులు జిల్లా ఎస్పీతో పాటు వెళ్లారు.

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking