Header Top logo

జార్జిరెడ్డి సోదరి జాయ్ @ లావణ్య మృతి

జాయ్ @ లావణ్యకు జోహార్లు

జార్జిరెడ్డి సోదరి జాయ్ @ లావణ్య సోమవారం సాయత్రం అనారోగ్యంతో మైసూర్ లో కన్నుమూశారు.కుటుంబ కలహాలు,ఆర్ధిక సమస్యలతో ఆమె తన చదువు మధ్యలోనే మానేస్తే జార్జిరెడ్డి పట్టుబట్టి మరీ చదివించారు. ఫలితంగా మైసూర్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో పరిశోధన చేసింది. బోధించింది.

ఆమె పేద మధ్యతరగతి విద్యార్థులను, ముఖ్యంగా దళితులను ఆదరించింది.

మైసూర్ లోని తన ఇంటిలో అనేక మంది విద్యార్థులు అక్కడే తిని చదువుకునేవారు.

జార్జిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో జార్జి విషయాలను ప్రస్తావించారు ప్రసంగించారు.

జార్జిరెడ్డి చివరి సోదరిగా మిగిలిఉన్న జాయ్ మరణించడం బాధాకరం.

ఆమెకు PDSU గ్రేటర్ హైదరాబాద్ తరుపున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం..

Source: గీత రామస్వామి

Leave A Reply

Your email address will not be published.

Breaking