Header Top logo

కోవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దు – రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్రెడ్డి

AP 39 TV 26 మార్చ్ 2021:

కిల్లర్‌ కరోనా వైరస్‌ను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వినియోగించడంతో పాటు సామాజిక దూరం పాటించడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. ఏడాది దాటినా  కరోనా తగ్గకపోవడం బాధాకరం అన్నారు. అయితే ముందు జాగ్రత్తలతో తరిమికొట్టవచ్చని చెప్పారు. శుక్రవారం ఆయన కరోనా టీకా వేయించుకున్న అనంతరం మాట్లాడారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking