Header Top logo

దళితమేధావి శ్రీ దామోదరం సంజీవయ్య వర్దంతి

AP 39TV 08మే 2021:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి, అంతేకాకుండా సంయుక్త మద్రాస్ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, మరియు కేంద్ర ప్రభుత్వంలోనూ అనేక సార్లు మంత్రి పదవులను అలంకరించి భారతదేశానికి, ముఖ్యంగా భారత పేదప్రజల,కార్మికుల ఉద్దరణకు సమర్థవంతమైన పాలనను అందించిన గొప్ప పాలనాదక్షులు, దార్శనికులు, దళితమేధావి శ్రీ దామోదరం సంజీవయ్య  మన అనంతపురములోని Govt Arts College విద్యార్థి కావడం అనంతపురం జిల్లాకు గర్వకారణం.మే 8 ఆయన వర్దంతి సందర్బంగా ఘన నివాళి అర్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం  అనంతపురం.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ST శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు సాలెవేముల బాబు , ప్రధాన కార్యదర్శి కటిక జయరాం , ట్రెజరర్ లక్ష్మీ నారాయణ, లీగల్ అడ్వయిజర్ నాగన్న, మునిస్వామి  తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking