Header Top logo

AP లో రేషన్ డోర్ డెలవరీ వాయిదా

ఏపీ 39టీవీ 27 జనవరి 2021:

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన రేషన్ డోర్ డెలివరీ పథకం మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 1న ప్రారంభం కావాల్సిన ఈ పథకం పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రద్దు అయినది. అనంతపురం జిల్లా కదిరిలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించాలి. అయితే ఈ కార్యక్రమాన్ని కూడా అధికారులు రద్దు చేశారు. ఏడాది నుంచి ఈ కార్యక్రమానికి ఏదీ కలిసిరావడం లేదు. బియ్యం కార్డుల మంజూరులో ఆలస్యం, కరోనా లాక్ డౌన్, ఆ తర్వత కొత్త కార్డుల మంజూరు వంటి పనులు ఆలస్యం కావడంతో పథకం ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking