Header Top logo

హిందూపురంలో మరొక సారి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటాం- టీడీపీ నాయకులు.

AP 39TV 03మార్చ్ 2021:

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ  స్వగృహంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ పరిశీలకురాలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ , పరిశీలకులు, బండారు మనోహర్ నాయుడు,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రొద్దం నర్సింహులు,మాజీ ఆహుడా చైర్మన్ అంబికా లక్ష్మీ నారాయణ  మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయామంలో MLA నందమూరి బాలకృష్ణ  చేసిన అభివృద్ధి తిరిగి మున్సిపలిటీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ప్రజలు తెదేపా వార్డు సభ్యులను గెల్పిస్తారని ,గతంలో ఎన్నడూ లేని విదంగా ఈసారి అన్ని సామాజిక వర్గాలు,SC, ST, BC, మైనారిటీ వర్గాలకి చెందిన 21 మంది వార్డు అభ్యర్థులను మహిళలకు కేటాయించామని  హిందూపురం అభివృద్ధి, ఆంద్రప్రదేశ్ రాష్టాభివృద్ది ఒక తెలుగుదేశం పార్టీ తో నే సాధ్యమని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో  కొల్లకుంట అంజినప్ప,రామంజినమ్మ, గ్రీన్ పార్క్ నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్, అమరనాథ్, పట్టణ ఉపాధ్యక్షుడు DE రమేష్, చంద్ర, డైమండ్ బాషా, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking