Header Top logo

వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటానని ప్రకటించిన నాగార్జున

వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను తాను దత్తత తీసుకుంటున్నట్టు సినీ నటుడు నాగార్జున ప్రకటించారు. తాను హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నిన్నటి ఎపిసోడ్ కు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున ఈ ప్రకటన చేశారు.

అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ మూడు వారాల్లో మూడు మొక్కలు నాటాలని కంటెస్టెంట్స్ కు సూచించారు. తన అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులందరూ మొక్కలు నాటాలని కోరారు. అంతేకాదు సంతోశ్ కుమార్ ఇచ్చిన మొక్కను బిగ్ బాస్ హౌస్ లో నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంతోశ్ కుమార్ చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రశంసిస్తున్నానని చెప్పారు. సంతోశ్ కుమార్ స్ఫూర్తిని తాను కూడా కొనసాగిస్తానని అన్నారు.
Tags: Nagarjuna, Tollywood, Plants Planting, Bigg Boss, Reserve forest

Leave A Reply

Your email address will not be published.

Breaking