Header Top logo

థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్ షిప్-2020 పోటీలకు సంబంధించిన పోస్టర్ విడుదల

తూర్పు గోదావరి జిల్లా థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 12 మరియు 13వ తేదీలలో రాజమండ్రిలోని SKVT డిగ్రీ కళాశాలలో జరగనున్న జిల్లా స్థాయి థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్ షిప్-2020 పోటీలకు సంబంధించిన పోస్టర్ ను థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా చైర్ పర్సన్, గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు, జిల్లా స్థాయి థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్ షిప్-2020 పోటీలకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా జాయింట్ సెక్రటరీ జి. సురేందర్ జిల్లా అధ్యక్షులు బి.చంద్రశేఖర్ మామిడికుదురు జిమ్ కోచ్ ఎన్.మురారి,ప్రకాశ్ పాల్గొన్నారు. క్రీడాకారులు తమ ఆధార్ కార్డు,స్టడీసర్టిఫికెట్,ఫోటోలు-2 పాస్ పోర్ట్ సైజ్, 12వ తారీకు ఉదయం 10 గంటల లోపు పెరు నమోదుచేయించుకోవాలని జిల్లా జనరల్ సెక్రటరీ బి.మధుకుమార్ ప్రజనేత్ర మీడియా కు తెలిపారు.ప్రజనేత్ర రిపోర్టర్ బి.చందు తూర్పుగోదావరి.

Leave A Reply

Your email address will not be published.

Breaking