Header Top logo

లొద్దలపేట గ్రామంలోని శ్రీలక్ష్మీ పేరంటాలు ఆరాధనోత్సవం

శ్రీకాకుళం, పొందూరు,ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని ఆమదాలవలస మండలంలోని లొద్దలపేట గ్రామంలోని శ్రీలక్ష్మీ పేరంటాలు ఆరాధనోత్సవాలలో భాగంగా శనివారం జరిగిన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళ వాయద్యాలతో ఊరేగింపుగా జరిగిన ఈ శోభాయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కళశాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందసమారాధనలో భాగంగా తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.పూజారి రాధాకృష్ణ శ్యామల దంపతులు అన్న సమారాధన జరిపించారు.సాయంత్రం సత్సంగసుధ మరియు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లొద్దలపేట గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాలైన తాడివలస, బెలమాం, గండ్రేడు, వెంకంపేట తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గురుగుబెల్లి వెంకటరావు,ప్రజానేత్ర – రిపోర్టర్,

Leave A Reply

Your email address will not be published.

Breaking