Header Top logo

రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రిలే నిరాహార దీక్ష

నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలని కోరుతూ 33 రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చీమకుర్తిలో రైతుల దీక్షలను జిల్లా రైతుసంఘం కార్యదర్శి పమిడి వెంకట్రావు ప్రారంభించి మాట్లాడారు.మొదటి రోజు దీక్షలలో రైతుసంఘం మండల అధ్యక్షులు బెజవాడ శ్రీను,రైతులు పమిడి నరసింహారావు,పులి ఓబులరెడ్డి,కొల్లూరి అక్కయ్య,పమిడి సుబ్బారావు,బక్కా కోటయ్య,తన్నీరు అంకమ్మ కూర్చున్నారు.దీక్షలకి మద్దతుగా ప్రజాసంఘాల మండల నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు,కంకణాల వెంకటేశ్వర్లు, తొట్టెంపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్.ప్రసాద రావు.

Leave A Reply

Your email address will not be published.

Breaking