Header Top logo

ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పెదలు కు ఇంటి స్థల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలు.ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై. యస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్‌ జగనన్న కాలనీలు పేరుతోఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ యోగం కల్పించే బృహత్తర యజ్ఞానికి సమయం ఆసన్నమైంది. దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థల పట్టాల పంపిణీ,గృహ నిర్మాణ భూమి పూజలను పండుగలా నిర్వహించారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్లనియోజకవర్గం ఎచ్చెర్ల మండలం1.ఎచ్చెర్ల119పట్టాలను, 2.SSRపురం37పట్టాలను,3.అజ్జరాం13పట్టాలను,4.ధర్మవరం18పట్టాలను,5.భగీరధపురం9పట్టాలను, 6.కొయ్యాం27పట్టాలను, 7.కుప్పిలి76పట్టాలను, 8.బుడగట్లపాలెం105పట్టాలనుమొత్తం404పట్టాలను ఈ గ్రామాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ పాల్గొని లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎచ్చెర్లమార్కెట్ కమిటీ చైర్మన్ మాడుగుల రూపావతి, ఎచ్చెర్లమండల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking