Header Top logo

ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు సమాజానికి నిదర్శనం*

మెదక్ జిల్లా చేగుంట మండలం పరిధిలో గల పోతంశెట్టి పల్లి గ్రామపంచాయతీలో ఎస్సీ మాదిగ డి శంకర్ ఆర్థికంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో స్నేహితులు విషయం తెలుసుకొని ఆదివారం నాడు అందరూ కలుసుకొని తలా వంతు డబ్బులు పోగు చేసుకుని ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని నారాయణ చారి లక్ష్మణ్ గౌడ్ తెలిపారు అనంతరం నారాయణ చారి మాట్లాడుతూ నెల రోజుల క్రితం నా స్నేహితుడి శంకర్ భార్య అనారోగ్యం చేత మృతిచెందడంతో నెల రోజుల నుండి కృంగిపోవడం మాకు తెలిసిందని తెలిపారు అనంతరం 1994 95 సంవత్సరం లో పదవతరగతి కలిసి చదువుకున్నామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు ఈ విషయం తెలుసుకొని మా స్నేహితుడు ఆపదలో ఉన్నాడని అందరికీ దృష్టికి తీసుకెళ్లి మేమందరం డబ్బులు పోగు చేసుకుని ఈరోజు మా స్నేహితుని దగ్గరికి వచ్చి 20 వేల రూపాయలు 50 కిలోల బియ్యం మా స్నేహితులు కలిసి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని కైలాస శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు స్నేహితులు దుంపల శ్రీనివాస్ కమిలి బాబా అయూబ్ ది న్ చందర్ అశోక్ రెడ్డి గుడ్డి సిద్ధి రమేష్ వడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట.

Leave A Reply

Your email address will not be published.

Breaking