Header Top logo

ఐసోలేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో

ఏపీ 39 టీవీ న్యూస్ మే 29

గుడిబండ :- పరిధిలోని రాళ్ల పల్లి గ్రామంలో లో కరోనా మహమ్మారి వ్యాధి సోకిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలను గుడిబండ ఎంపీడీవో నరేంద్ర కుమార్ తనిఖీ నిర్వహించారు వారు మాట్లాడుతూ గ్రామాలలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఈ వార్డులో చికిత్స పూర్తి స్థాయిలో అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏ ఒక్కరు అసౌకర్యానికి గురికాకుండా గ్రామ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఈ వార్డు నిర్వహణ నిర్వహణ సర్పంచ్ ప్రాధాన్యత అధికంగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించి సర్పంచ్ గ్రామ కార్యదర్శులు ఇతర అధికారులు సమన్వయంతో పనిచేయాలని వివరించారు ఈ కార్యక్రమంలో రాళ్ల పల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ పంచాయతీ కార్యదర్శి గోవిందప్ప శంకరగల్లు సర్పంచ్ జయమ్మ పంచాయతీ కార్యదర్శి అరుణ నాయకులు నరేంద్ర వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking