Header Top logo

భీమాకోరేగావ్ అమరవీరుల బహుజన  విజయ్ దివాస్

జనవరి ఒకటిన గ్రామ గ్రామాన
“బహుజన  విజయ్ దివాస్” గా
పాటిద్ధాం…!

“భీమాకోరేగావ్”అమరవీరుల
ఆశయాల పూదోటలో
లాల్-నీల్  మల్లెలై పూస్తాం…

చరిత్ర నిండా నెత్తురొలికిన ఆనవాళ్లే
ఆ నెత్తుటి విత్తనాలకు మొలకెత్తిన
మోదుగు చెట్ల వనంలో విరబూసిన
అగ్నిపూలై పూస్తాం

చరిత్రలో కోల్పోయిన “ఆశోక మౌర్య సామ్రాజ్య”
బహుజన రాజ్యాధికార సాధనకై
లాల్ -నీల్ ఐక్య శక్తులుగా పిడికిలెత్తి పురోగమిస్తాం..

సారవంతమైన సింధు నాగరికత త్యాగాల నేలపై
వీరుల వాగ్దానపు విత్తనాలై మొలకెత్తుతాం..
ఫూలే-అంబెడ్కర్, పెరియార్,మార్క్స్ లు కలలుగన్న
సామ్యవాద బహుజన రాజ్యాధికార సాధనకోసం
పునరంకితమవుతాం…!

మానవ చరిత్ర పరిణామక్రమంలో
గెలుపొటముల అనుభావలను
గుండెల్లో పదిలంగా దాచుకుంటాం

తాత్కాలిక ఓటమిని అదిగమిస్తూ
భవిష్యత్తు ఆశయాల ప్రయాణంలో
నిరాశకే నిరాశను పుట్టిస్తామని
వాగ్దానం చేస్తూ…

వీరుల నెత్తుటి త్యాగాల
జెండాను ఎద ఎదపై మోస్తాం
మరో ప్రపంచపు సాధన కోసం దారులు వేస్తాం..!!

మిత్రులారా….!
ఒక శ్రామిక వర్గ విప్లవ సైద్ధాంతిక వేత్త
చెప్పినట్లుగా
విత్తనం తాను నశించిపోతూ
పంటను వాగ్దానం చేసినట్లు
ఒక వీరుడు నేలకొరుగుతూ నూతన వ్యవస్థను వాగ్దానం చేసినట్లుగా…

భీమాకోరేగావ్ (మహార్ ) బహుజన జాతుల
వీరయోధుల వీరోచిత పోరాట ధీరత్వం
భారతీయ సమాజంలో అసమానతల

దాష్టీక వ్యవస్థ చరిత్ర ఉన్నంతకాలం వారి పోరాట వారసత్వం చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉంటుంది.

భారతీయ సమాజంలో అత్యంత అవమానకరమైన రీతిలో ఉత్పత్తి జాతులై బహుజనులను
ముఖ్యంగా దళితులకు మూతికి ముంతా,
ముడ్డికి చీపురు కట్టి
ఊరవతల ఉంచి నీచమైన జాతిగా చిత్రీకరించబడిన
జాతులకులు తిరుగుబాటు ద్వారా చరిత్రలో అద్భుతమైన విజయం సాధించిన రోజే జనవరి ఒకటికి ఉన్న చారిత్రక నేపథ్యం.
★1818 జనవరి ఒకటిన మహారాష్ట్రలోని ,
పూనే జిల్లా కు ముప్పై కిలోమీటర్ల దూరంలో
భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామంలో 500 వందల మంది బహుజన జాతుల (మహార్) సిపాయిలకు

★ 28 వేలమంది  పీష్వా బ్రాహ్మణాధిపత్య దోపిడి

సైన్యాలకు మద్య జరిగిన యుద్ధంలో 28 వేల పీష్వాల సైనికులను తుదముట్టించారు కేవలం
ఐదు వందల మంది(మహార్)బహుజన జాతుల వీర యోధులు.
ఈ సందర్భంగా జరిగిన వీరోచిత పోరాటంలో
★ 23 మంది బహుజన వీరులు వీరమరణం పొందారు.
వారి జ్ఞాపకార్థంగా
( విజయ్ స్తంభం ) నిర్మించారు,
నాటి బ్రిటిష్ ప్రభుత్వ హయంలో.
1928లో ఇక్కడ జరిగిన మొదటి సంస్మరణ
సభకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో జరిగింది. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం
జనవరి 1 న డాక్టర్ బాబాసాహేబ్ అంబెడ్కర్ గారు
కచ్చితంగా భీమాకోరేగావ్ మృతవీరుల సంస్మరణ
విజయ్ స్థంభం (స్థూపం) వద్ద నివాళులు అర్పించేవారు.
★ భీమాకోరేగావ్ వారసత్వ సంపదను జాగ్రత్తగా భధ్రపర్చి జాతికి అందించినవారు
“మహాత్మా జ్యోతి బా ఫూలే” గారు.
ఒకవేళ మహాత్మా జ్యోతిబా ఫూలే గనుక
భీమాకోరేగావ్ వీరుల చరిత్ర రాసి పెట్టకపోయిఉంటే, భారతదేశంలో జరిగిన దాదాపు రెండు వందల తిరుగుబాట్లలో అతి ముఖ్యమైన,
అత్యంత సాహసోపేతమైన
తిరుగుబాటు ద్వారా ఆధిపత్య అగ్రవర్ణ పీష్వా పాలనను కూలదోసిన
ఒక అద్భుతమైన చరిత్రను నేటి
బహుజన ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండేది కాదు.
★ భారతీయ సమాజంలో జరిగిన అనేకానేక చారిత్రక నేపథ్యం కలిగిన బహుజన వీరుల నెత్తురొలికిన రహదార్లు ఎన్నో…ఎన్నెన్నో…
ఉంటాయి.
ఆ రహదారుల ఆనవాళ్లను చెరిపేశామని సంబరాలు జరుపుకున్నారు ఆధిపత్య దోపిడి వర్గాలు..
కానీ ఈరోజు వందలు వేల సంఖ్యలో నిజమైన
ఫూలే-అంబెడ్కర్, పెరియార్ ల వారసులు
మరుగున పడిపోయిన చరిత్రను పరిశోధించడం ప్రారంభించారు…

★ ముప్పైఐదు సంవత్సరాల నా మార్క్సిస్టు ఉద్యమ జీవితంలో జరిగిన ప్రజా ఉద్యమాల అనుభావల స్పూర్తితో పనిచేసిన నాకు,
2015 నుండి భారతీయ విప్లవ దంపతులు మహాత్మా జోతి బా,సావిత్రమ్మ,
డాక్టర్ బాబాసాహేబ్,రామబాయి అంబెడ్కర్ లతోపాటు,
పెరియార్, ఛత్రపతి జీజావ్ బాయి, ఛత్రపతి శివాజీ, సాహుమహారాజ్, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, దళిత పాంథర్స్, తదితర మహానీయుల చరిత్ర పఠనం ఎప్పుడైతే పఠించడం ప్రారంభించానో
నా ముప్పై ఐదు సంవత్సరాల మా‌ర్క్సిస్టు
ఉద్యమ జీవితానికి మరింత చైతన్యతను పొందే అవకాశం ఏర్పడింది.
★ మిత్రులారా..!
2015 నుండి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భీమాకోరేగావ్ అమరవీరుల సంస్మరణ సభను జరుపుతున్నాము.
ఈరోజు దేశంలో బహుజన సంఘాలు భీమాకోరేగావ్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం అభినందనీయం.
మహోన్నతమైన వీరుల నెత్తురొలికిన నేల,
భీమా భూమికి లాల్-నీల్ సలాంలతో…
శ్రద్ధాంజలి గట్టిద్ధాం.

★  నిజమైన ఫూలే-అంబెడ్కర్, పెరియార్,మార్క్స్ ల వారసులైన ప్రతి బహుజన,వామపక్ష పార్టీలు, సంఘాలు, రచయితలు, కవులు

జనవరి 1-1-2023న వినమ్రంగా
పిడికిలెత్తి నివాళులర్పిద్ధామని తెలియజేస్తూ..

జైభీం లాల్ సలాంలతో…

దండి వెంకట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking