Header Top logo

బేబీ మినిష్టర్ దేశ ఉపప్రధాని Dr.బాబు జగ్జీవన్ రామ్ గారికి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ Mrps ఘన నివాళి

బేబీ మినిష్టర్ దేశ ఉపప్రధాని Dr.బాబు జగ్జీవన్ రామ్ గారికి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ Mrps ఆధ్వర్యంలో ఘన నివాళి
—సామ్రాట్ కెబి.మధు

Mrps ఆధ్వర్యంలో Dr బాబు జగ్జీవన్ రామ్ గారి 114వ జయంతి కార్యక్రమం ఉదయం 9.30నిముషాలకు అనంతపురం పట్టణం లోని మునిసిపల్ఆఫీస్ఎదురుగా ఉన్న Dr బాబు జగ్జీవన్ రామ్ విగ్రహనికి పూలమాలలువేసిఘనంగా నివాళ్ళు అర్పించడము జరిగింది
భారత ఉప ప్రధాన మంత్రి గాపనిచేసిన ఘన చరిత్ర కలిగిన మహోన్నతమైన నాయకులు. ఇతని రాజకీయ జీవితం 1936 బీహార్ శాసనమండలికి ప్రతిపాదించ బడి 1937లో శాసన సభకు ఎన్నికై 1986న తుది శ్వాస వదిలే వరకు అనేక కీలకమైన అత్యుత్తమ పదవులు అలంకరించి 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా దేశ రాజకీయా లలో బాబూజీ నైపుణ్యం అమోఘం సుదీర్ఘ కాలంలో అగ్రశేణి నేత గా రాణించడం సాధారణ విసయంకాదు, కార్మిక మంత్రిగా పరిశ్రమల వివాదాల చట్టం, కాఫీతోటల కార్మిక సంక్షేమ చట్టం, బొగ్గు కార్మికుల భీమా చట్టం, కనీసవేతన చట్టం, గనుల చట్టం, కార్మికుల ప్రోవిడెంట్ ఫాండ్ చట్టం, వీరి కాలంలోనే అమలుజరిగాయి. రైల్వే మరియు రవాణా, రక్షణా, ఆహారం -వ్యవసాయం శాఖా మంత్రి గా పనిచేసిన ఘన చరిత్ర కలిగిన బాబూజీ గారికి భారత రత్న అవార్డు ప్రదానం చేసి రుణం తీర్చు కోవాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వా నికి Mrps ద్వారా డిమాండ్ చేస్తూ న్నాము
ఈ కార్యక్రమం లో Mrps నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు Mrps సామ్రాట్ కెబి.మధు, Mef నాయకులు బి. శంకర్ హెల్త్ ప్రసాద్, అలెస్కో గారు, sc st విజిలెన్సు మానిటరింగ్ కమిటీ సభ్యులు C.తిరుపాల్ మరియు జిల్లా కమిటీ జయప్రకాశ్, చౌడప్ప, G.రవీంద్ర, మహిళా నాయకులు అన్నమ్మ, శాంతకుమారి, నిషార్ అహమ్మద్, ysrcp చందనా శివాజీ,
Dr బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ కమిటీ నాయకులు బ్యాంకు కృష్ణ మూర్తి, MS రామాంజినేయులు, SP.పుల్లన్న, చెన్నప్ప, BC లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు
ఇట్లు
ఉద్యమవందనాలతో
సామ్రాట్ కెబి. మధు
Mrps అనంతపురం ఇంచార్జ్

Leave A Reply

Your email address will not be published.

Breaking