Header Top logo

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి : జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్

ఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలం ఎచ్చెర్లMLA క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం సందర్భంగా ప్రియతమ నాయకులు ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలోఎచ్చెర్లనియోజకవర్గం రణస్థలం మండలం వేదిక: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించనున్న “మెగా రక్తదాన శిబిరంను”ఎచ్చెర్లనియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల యువత,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించనున్న “మెగా రక్తదాన శిబిరం పోస్టర్(గోడ పత్రిక )ను జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా “రక్త దానం చేయండి-ప్రాణదాతలు కండి అనే నినాదంతో రక్తదానం చేయడం వలన తోటి ప్రాణాన్ని రక్షించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులులావేరు మండలవైస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మీసాల సీతంనాయుడు,రణస్థలం మండల బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి,లావేరు మండల యువజన నాయకులు బాలి శ్రీనువాస్ నాయుడు,దన్నాన సీతారాం, పచ్చిగుళ్ల సాయిరాం, రెడ్డి విశ్వేశ్వరరావు,మీసాల శ్రీనువాసరావు,కంబపు రామిరెడ్డి, రమణ,తదితరులు పాల్గొన్నారు. ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ చిన్ని రణస్ధలం మండలం.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం

Leave A Reply

Your email address will not be published.

Breaking