Header Top logo

అర్హులైన వారికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలి

సుదేపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాల పై విచారణ జరిపి భూమి కోల్పోయిన వారికి మరియు అర్హులైన వారికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని లేకపోతే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ వెల్దుర్ధి మండల కార్యదర్శి టీ. కృష్ణ.AISF జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి డీ. సోమన్నలు మాట్లాడుతూ సుదేపల్లి గ్రామంలో పేద ప్రజలు కొన్నేళ్ల గా పశు గ్రాసం కొరకు ఏర్పాటు చేసుకున్న స్థలాలను స్వాధీనం చేసుకొని ఇళ్ల స్థలాలు ఇస్తామని మాయమాటలు చెప్పి వారి అనుచరులకు అనర్హులకు ఇండ్ల ప్లాట్లు కేటాయించడం చాలా సిగ్గుచేటని ఇప్పటికైనా ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు భూమి కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని లేకపోతే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు ఈకార్యక్రమంలో రైతు సంఘము నాయకులు మాధవ కృష్ణ. డీ. రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి

 

Leave A Reply

Your email address will not be published.

Breaking