Header Top logo

Movie star Srihari సినీ నటుడు శ్రీహరి అక్టోబర్ 9న వర్ధంతి

Movie star Srihari passed away on October 9

తెలంగాణ యాసకు ప్రాణం పోసిన సినీ నటుడు శ్రీహరి అక్టోబర్ 9న వర్ధంతి

సినిమాల్లో “తెలంగాణ యాస”కు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన ప్రముఖ నటుడు శ్రీహరి. ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం, తుఫాన్ వంటి చిత్రాలలో ఆయన పలికించిన సంభాషణలు తెలంగాణ యాసలో ఉన్న సౌందర్యాన్ని ఆవిష్క రించాయి. నిజ జీవితంలో హైదరాబాదీ తెలంగాణ యాసలో ఆయన సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా సాగేది.

శ్రీహరి (ఆగష్టు 15, 1964 – అక్టోబరు 9, 2013) తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. శ్రీహరి తాత రఘుముద్రి అప్పలస్వామికి ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. వీరిలో నాలుగవ కుమారుడు శ్రీహరి తండ్రి సత్యన్నారాయణ, తల్లి సత్యవతి. 1964 ఆగస్టు 15న జన్మించాడు.  రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి జీవనం సాగించారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అన్నదమ్ములు. శ్రీహరి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా విజయవాడ సమీపంలో జన్మించారు.

1977 లో యలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి ఏడవ తరగతి ఉత్తీర్ణుడు అయినాడు. ఆయన  తల్లిదండ్రులు గుడివాడకు చెందినవారు కాగా, తరువాత గ్రామంలోని అరెకరం భూమిని అమ్ముకొని హైదరాబాదుకు మకాం మార్చారు. అలా ఆయన చిన్నతనంలోనే బాలానగర్లో స్థిరపడ్డారు. స్టంట్ ఫైటర్‌గా శ్రీహరి  కెరీర్‌ను ప్రారంభించాడు. ఆయన జిమ్నాస్టిక్స్లో అథ్లెట్ కూడా. సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు రైల్వే ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభించాయి, కాని ఆయన నటనా వృత్తిని కొనసాగించ డానికి ఆసక్తి చూపినందున ఆయన ఆ ఆఫర్లను తిరస్కరించాడు. ఏటా యలమర్రు గంగానమ్మ జాతరకు శ్రీహరి తప్పనిసరిగా వెళ్ళేవాడు. యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఎంతో ఆసక్తి కలిగి వుండేవాడు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు శోభన థియేటర్ లో చూసేవాడు.

హైదరాబాద్ లో నిర్వహించిన అనేక శారీరక ధారుడ్య పోటీలలో  పాల్లొని ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నాడు. విశ్వ విద్యాలయం తరపున రెండు సార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచు కున్నాడు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి, అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు ‘ధర్మక్షేత్రం’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించాడు. పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. హీరోగా చేసిన మొదటి చిత్రం ‘పోలీస్’ అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం ‘పోలీస్ గేమ్’ కావడం విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చివరి చిత్రం తుఫాన్.

28 చిత్రాల్లో హీరోగా నటించాడు. రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించాడు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ కావాలను కున్నాడు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా….సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసాడు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మ నాయుడు’లో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది. తాజ్ మహల్ చిత్రంలో పూర్తిస్థాయి విలన్ పాత్రలో కనిపించాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయ రామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చు కున్నాడు. పృధ్వీ పుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయsreehari2మైన శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరలో షేర్ ఖాన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న శ్రీహరి, ఇటీవల రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్‌, రఫ్‌ (2014) సినిమాల్లో నటించాడు. శ్రీహరి 1991 లో డిస్కో శాంతిగా ప్రసిద్ది చెందిన దక్షిణ భారత నటి శాంతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అక్షర. నాలుగు నెలలకే కుమార్తె అకాల మరణం చెందగా, తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ ను అందించడంతో పాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాధనకు కృషి చేశాడు. తమ గ్రామానికి చెందిన శ్రీహరి రాష్ట్ర స్థాయికి ఎదిగి గ్రామం పేరును నలుదిశలా చాటినందుకు గర్వంగా యలమర్రు గ్రామ ప్రముఖులు 1989 సంవత్సరంలో శ్రీహరిని హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాంబో రాజ్‌కుమార్” సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి, అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న కాలేయ సంబంధ వ్యాధి వలన ముంబై లో కన్నుమూసాడు. 2005 లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందు కున్నాడు. ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు (తెలుగు) – నువొస్తానంటే నేనొద్దంటానా  (2005);  ఉత్తమ విలన్ గా నంది అవార్డు – తాజ్ మహల్ (1995); నంది స్పెషల్ జ్యూరీ అవార్డు – శ్రీ రాములయ్య (1998); నంది స్పెషల్ జ్యూరీ అవార్డు – పోలీస్ , రామ సక్కనోడు (1999); నంది స్పెషల్ జ్యూరీ అవార్డు – విజయ రామరాజు (2000); ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు – నువొస్తానంటే నేనొద్దంటానాకు  (2005) లభించాయి..  

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత  సెల్:   9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking