రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి, స్థానిక శాసనసభ్యులు KTR ప్రారంబం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి, స్థానిక శాసనసభ్యులు KTR ప్రారంభించారు. రూ.3 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు సరిపడేలా 33 గదులను నిర్మించారు. డైనింగ్‌ హాల్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టులు, సీసీ కెమెరాలు, అత్యాధునికమైన గ్రంధాలయం, మోడ్రన్‌ టాయిలెట్స్‌, సురక్షిత తాగునీరు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్‌ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.

 

 

Comments (0)
Add Comment