విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ -అఖిల భారత యువజన

AP 39 TV 21ఫిబ్రవరి 2021:

కదిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నల్ల బ్యాజ్ లతో నిరసన.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా యువజన నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమలో దాదాపుగా లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారని ప్రవేటికరణ చేస్తే కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించాలని డిమాండ్ చేశారు.

 

 

 

 

Comments (0)
Add Comment