జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన – జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు IPS

AP 39TV 16 ఫిబ్రవరి 2021:

జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న అనంతపురం మండలం రుద్రంపేటలో జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  ఆదేశాలతో పోలీసు అధికారులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పిస్తూ ఈ కవాతు సాగింది. పలువురు పోలీసు అధికారులు, పోలింగ్ బందోబస్తు పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Comments (0)
Add Comment