లక్కసముద్రం (MPUP) పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన – యువ నాయకుడు సుదర్శన్ రెడ్డి

AP 39TV 12ఏప్రిల్ 2021:

మన ప్రియతమ ఎమ్మెల్యే P.V సిద్ధారెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు లక్క సముద్రం పంచాయతీ లో గల లక్కసముద్రం (MPUP) పాఠశాలలో లక్కసముద్రం వైఎస్ఆర్సిపి యువ నాయకుడు సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నాడు నేడు పథకాన్ని సకాలంలో పూర్తి చేయాలని స్కూల్ హెడ్మాస్టర్ ని మరియు ఉపాధ్యాయులను ఆదేశించడం జరిగింది . అదే విధంగా (MDM) జగనన్న గోరుముద్ద పథకాన్ని పరిశీలించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆయాలతో సంప్రదించి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఆయాలకు వస్తున్నటువంటి జీతం 1000 రూపాయలు నుండి 3000 పెంచిన జీతాన్ని సకాలంలో అందుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సంబంధించింది ఎటువంటి సమస్యలనైనా తమ దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులను కోరడం జరిగింది.

 

Comments (0)
Add Comment