కోవిడ్19పై సచివాలయాలు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి – తహసిల్దార్ ఆనంద్ కుమార్

AP 39TV 05 జూన్ 2021:

మడకశిర గ్రామాలలో ప్రజలకు కోవిడ్ 19 పై ప్రజలకు అవగాహన కల్పించాలని తహసిల్దార్ ఆనంద్ కుమార్ సూచించారు.మడకసిరా పట్టణంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం వీఆర్వో పంచాయతీ సెక్రెటరీ ల తో కోవిడ్ 19 పై సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో కోవిడ్ 19 బారిన పడకుండా ప్రజలకు వీఆర్వో పంచాయతీ సెక్రెటరీ అవగాహన కల్పించాలన్నారు. అంతేకాకుండా ప్రతి సచివాలయం వద్ద ప్రజలకు అవగాహన కలిగేలా కోవిడ్19 పై ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.కరోన రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆనంద్ కుమార్, ఏవో నరసింహ మూర్తి, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వో లు తదితురులు పాల్గొన్నారు.

 

 

 

కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
మడకశిర ఆర్సి ఇంచార్జ్.

Comments (0)
Add Comment