గంగుల కమలాకర్ ను పరామర్శించిన మంత్రి

మంత్రి గంగుల కమలాకర్ ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కరీంనగర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర మరియు ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ గారి తండ్రి గంగుల మల్లయ్య(85) గారు ఇటీవల మృతి చెందిన విషయం విధితమే.

కాగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి కమలాకర్ ను పరామర్శించారు.

మల్లయ్య గారి చిత్రపటం వద్ద పూలు చల్లి, నివాళులు అర్పించారు. మంత్రి కమలాకర్ గారిని పరామర్శించారు.

మల్లయ్య గారి మృతి పట్ల సంతాపం తెలిపారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

Minister Errabelli Dayakar Rao visited Minister Gangula Kamalakar
Comments (0)
Add Comment