తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ గా మాణిక్ రావు థాక్రే

తెలంగాణలో రాష్ట్రంలో ఏర్పాడిన రాజకీయ సంక్షోభంను పరిష్కారించడానికి ఆ పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇన్ చార్జీగా ఉన్న మాణిక్యం ఠాకూర్ ను గోవా ఇన్ చార్జీగా నియమించింది అధిష్టాన వర్గం. 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌ రావు థాక్రేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించింది.

కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జిని మారుస్తారనే ప్రచారం జోరుగా సాగింది.

ముఖ్యంగా మాణిక్యం ఠాగూర్‌ వ్యవహరశైలిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.

ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు చెప్పినట్లు తెలిసింది.

 

Manik Rao Thackeray as the in-charge of Telangana Congress
Comments (0)
Add Comment