అనంతలో అట్టుడికిన భారత్ బంద్

AP 39 TV 26 మార్చ్ 2021:

అనంతపురం నగరంలోని అన్ని ప్రాంతాల్లో కలియ తిరుగుతూ, దుకాణా దారుల్ని మరియు హోటళ్లు బస్సులు స్వచ్చందంగా భారత్ బంద్ సహకరించాలని కోరుతూ చేపట్టిన బంద్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె.ఎల్. మురళీధర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ప్రజలు స్వచ్చందంగా మద్దతు ఇస్తూ ఆయన వెంట నడవడం తో సంపూర్ణంగా విజయవంతానికి నాంది పలికింది.భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె.ఎల్. మురళీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైంది.

 

 

Comments (0)
Add Comment