కన్నులపండువగా హేమావతి శ్రీ సిద్దేశ్వరస్వామి రథోత్సవం

కన్నులపండువగా హేమావతి శ్రీ సిద్దేశ్వరస్వామి రథోత్సవం
శివనామస్మరణలతో పోటెత్తిన భక్తజనం

ఏపీ39టీవీ న్యూస్ మార్చి16
గుడిబండ:-అమరాపురం:
మండలంలోని ప్రసిద్దిగాంచిన హేమావతి శ్రీ యoజేర సిద్దేశ్వరస్వామి బ్రమ్మోత్సవాల్లో భాగంగా అరవరోజైన మంగళవారం స్వామి వారి రథోత్సవంను భక్తులు కన్నులపండువగా జరుపుకున్నారు.
ఈ సందర్బంగా ఉదయం స్వామి వారికి వివిధరకాల అభిషేకంలను జరిపించారు, ప్రత్యేక పూజలను నిర్వహించారు,ప్రత్యేకఅలంకరణతో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తిని గర్బగుడినుంచి మేళతాళలతో తీసుకొచ్చి రథంలో కూర్చుండబెట్టి పూజలు జరిపించి శివనామస్మరణలతో రథాన్నిలాగి భక్తులు తమ తమ కోర్కెలను తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతవాసులే కాక కర్ణాటకలోని బెంగళూరు, తుమకూర్,మధుగిరి,సిరా, హిరియూర్, పావగడ, చెళ్లకెర, తదితర ప్రాంతాలనుంచి అత్యధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రథోత్సవంలో పాలొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక అమారాపురం ఎస్ఐ చండ్ర ఆంజనేయులు తో పాటు రొళ్ల ఎస్ఐ ముక్బల్ బాషా గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ లు తమ పోలీసు సిబ్బందితో కలసి గట్టి బందోబస్తూ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, మడకశిర సిఐ రాజేంద్ర ప్రసాద్, దేవాదాయశాఖ ఈఓ నాగేంద్రప్రసాద్, ఆలయకమిటీ చైర్మన్ గోవిందరాయ,సర్పంచ్ తిప్పేస్వామి,పంచాయతీ కార్యదర్శి ఫణిరాజ్,తదితరులు భారీ సంఖ్యలో భక్తులు,ప్రజలు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment