తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహిచిన స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు.

ఆలయ మాడ వీధుల్లో స్వర్ణ రథంపై విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని గ్యాలరీల్లో నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

గోవింద నామస్మరణతో మాడ వీధులు మారుమోగాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉ.1.45గం.ల నుంచి ఉత్తర ద్వార దర్శనభాగ్యం కల్పించారు.

Comments (0)
Add Comment