ప్రతీ ఓటరు గడపగడపకు వెళ్లి ధన్యవాదములు తెలిపిన- అజ్మతుల్లా

AP 39TV 18ఫిబ్రవరి 2021:

కనేకల్ మేజర్ న్యూస్: కణేకల్ పట్టణంలో నీ రెండువ వార్డులో వార్డ్ మెంబర్ గా అత్యధిక మెజార్టీతో గెలుపు పొందిన అజ్మతుల్లా రెండవ వార్డ్ లోని గడప గడప కు వెళ్లి పేరు పేరునా ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ సందర్బంగా అజ్మతుల్లా మాట్లాడుతూ జగనన్న ప్రజల కోసం ప్రవేశ పెట్టిన నవరత్నాలు మరియు పథకాలు ప్రజలందరికీ అందుతూ ఉన్నాయని తన గెలుపుకు కారణం జగనన్న పథకాలే అని తెలియజేశారు, వార్డులోని ప్రజలందరికీ అందుబాటులో ఉండి జగనన్న ప్రవేశపెడుతున్న పథకాలను వార్డులోని అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తానని తనపై నమ్మకంతో తనకు మద్దతు తెలిపిన గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీ కాపు రామచంద్రారెడ్డి కి అలాగే కేశవరెడ్డి,ఆలూరు చిక్కన్న, ఫ్లోరెన్స్ నిర్మల, నబిసాబ్, మక్బూల్, హోన్నూరుస మరియు తనకు ఇంత భారీ మెజారిటీతో గెలుపును అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అజ్మతుల్లా తెలిపారు, ఈ కార్యక్రమంలో రెండవ బూత్ కమిటీ మెంబర్ బండిమడీ రియాజ్ ,జిలన్,చిన్న సర్మాస్, రహమతుల్లా,చిన్న హసెన్, మరియు తదితరులు పాల్గొన్నారు.

 

 

R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,
రాయదుర్గం ఇంచార్జి.

Comments (0)
Add Comment